బూదిగుమ్మ బ్రిడ్జి నిర్మాణం చేయండి – బిజెపి, జనసేన

ఉరవకొండ, బెలుగుప్ప మండలంలోని బూదిగుమ్మ పెన్నా నదిపై బ్రిడ్జి రెండు దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో లేదు. ఈ బ్రిడ్జ్ లేకపోవడంతో దాదాపు 20 నుండి 25 గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్ని సార్లు అధికారులకు విన్నవించి పట్టించుకోలేదు ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు ఈ మధ్య కాలంలో అనుమతులు వచ్చాయని మరియు 53 కోట్లు వ్యయంతో ఈ నిర్మాణం చేపడతామని ప్రభుత్వం మీడియా ముఖంగా ప్రకటించినప్పటికి ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మించేలా చూడాలి అని బెలుగుప్ప మండల తహసీల్దార్ కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు వన్నూరుస్వామి, బీజేపీ మండల సీనియర్ నాయకులు కె.మనోహర్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్, అల్ ఇండియా ఎస్సి, ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ నిర్వహణ కార్యదర్శి వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు.