ఆకుల మనస్విని అభినందించిన బర్మా ఫణి బాబు

నూజివీడు: టెన్త్ క్లాస్ ఫలితాల్లో 599 మార్కులు సాధించి నూజివీడు కీర్తిని దేశ వ్యాప్తంగా కొనియడేలా చేసిన టెన్త్ స్టేట్ ఫస్ట్ విద్యార్థిని ఆకుల మనస్విని అభినందించి, సత్కరించిన నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు. ఆయనతో పాటు జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటి సభ్యులు పాశం నాగబాబు, వీరమహిళలలు నీట్ల ఉమమహేశ్వరి, జక్కుల లక్ష్మి, జనసేన నాయకులు బళ్ల వీరాస్వామి, నాగరాజు, రాజు పాల్గొన్నారు.