నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి: గాదె పృథ్వి

స్టేషన్ ఘనపూర్: నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా, మండల కేంద్రాలతో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించి అన్ని గ్రామాలకు రవాణా అనుసంధానం చేయాలన్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాలకు ఇప్పటికి బస్సు సౌకర్యమే లేదని పేర్కొన్నారు. బస్సు సౌకర్యం లేకుండా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ఉపయోగం లేదని ఏద్దేవా చేశారు. పథకం ప్రారంభించి నెల గడుస్తున్నప్పటి గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యం కల్పించకపోతే ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ప్రయోజనం లేదన్నారు. వెంటనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు. ఎన్నికల్లో గెలిస్తే గ్రామాలను అనుసంధానం చేసేందుకు రోడ్లు నిర్మిస్తామన్నా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముందు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడం పట్ల దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహమ్మద్ రజక్, మునిగాల పవన్, అక్కెనపల్లి సాయి, పోలె ప్రశాంత్, పులిగిల్ల సైదులు, బన్నీ తదితరులు పాల్గొన్నారు.