ఏపీ- తమిళనాడు మధ్య ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు..

కరోనా నేపథ్యంలో 8 నెలల తర్వాత ఏపీ- తమిళనాడు మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఇప్పుడు మరో అంతర్జాతీయ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

ఏపీ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి చెన్నైకి బస్సులు నడపనుంది. రాష్ట్రంలోని పలుచోట్ల నుంచి చెన్నైకి బస్సులు తిప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు వెళ్లే బస్సులకు రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించినట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.