మజ్జిగ పంపిణీ చేసిన సింగరాయకొండ జనసేన

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ సలహాల మేరకు, సింగరాయకొండ ట్రంక్ రోడ్డులోనీ జనసేన పార్టీ అధ్వరంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ఆదివారం నాడు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, దండే ఆంజనేయులు, అనుములశెట్టి కిరణ్ బాబు, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా భాష, పోనుగోటి అశోక్, చలంచర్ల కరుణ్ కుమార్, సంకే నాగరాజు, మాక వెంకటేశ్వర్లు, వాయల శివ, చెంచంగారి కళ్యాణ్, హరికృష్ణ, సుబ్రహ్మణ్యం మరియు జనసైనికులు పాల్గొన్నారు.