శ్రీరామనవమి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం

ఎమ్మిగనూరు: మెగా ఫాన్స్ ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి గుడి నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని, ప్రతి సంవత్సరం ఇలా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం తమకు ఎంతో ఆనందం అనే రాబోయే సంవత్సరాలు కూడా శ్రీరామనవమి పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేపడతామని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిపై రాముల వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ వెంకటేష్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.