విశ్వనాథపల్లి జనసైనికుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి కార్యక్రమం

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ పరిధి లోని కోడూరు మండలం లో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి జాతర మహోత్సవమునకు విచ్చేయుచున్న అశేష భక్తులకు వేసవి దాహం తీర్చుటకు విశ్వనాథపల్లి జనసైనికులు జనసేన పార్టీ తరుపున మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసైనికులు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. ఈ సంవత్సరం కూడా 7౦౦౦ మందికి పైగా మజ్జిగ పంపిణి చేసేటట్టు ఏర్పాటు చేసినట్టు తెలియచేసి, ప్రతి ఒక్క భక్తుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు.