సింగరాయకొండ జనసేన ఆధ్వరంలో మజ్జిగ పంపిణి

సింగరాయకొండ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సలహాల మేరకు, సింగరాయకొండ ట్రంక్ రోడ్డులో జనసేన పార్టీ ఆధ్వరంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. చలివేంద్రం ఏర్పాటు చేసి ఐదు వారాలు పూర్తి చేసుకొని, వేసవికాలంలో దాహార్తి తీర్చడానికి ప్రతీరోజు చల్లని మినరల్ వాటర్ మరియు ప్రతి ఆదివారం చల్లని మజ్జిగ ప్రయాణికులకు, బాటసారులకు మరియు ప్రజలకు జనసేన పార్టీ తరుపున అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అయినాబత్తిన రాజేష్, దండే ఆంజనేయులు, ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యుడు కాసుల శ్రీకాంత్, అడుసుమల్లి శ్రీకాంత్ శ్రీమతి రాధికా, సయ్యద్ చాన్ బాషా, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా భాష, చలంచర్ల కరుణ్ కుమార్, సంకే నాగరాజు, మాక వేంకటేశ్వర్లు, షేక్ సుభాని మరియు జనసైనికులు పాల్గొన్నారు.