పెడన జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం

పెడన నియోజకవర్గం: పెడన పట్టణంలో యడ్లపల్లి రామ్ సుధీర్ గారి అధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ డొక్క సీతమ్మ మజ్జిగ పంపిణీ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న రైల్వే గేటు నుండి బస్టాండ్ సెంటర్ వరకు ఎండలో ఇబ్బందులు పడుతున్న వారి దాహార్తిని తీర్చేందుకు జనసేన నాయకులు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూనపరెడ్డి రంగయ్య, పోలగాని లక్ష్మి నారాయణ, పుల్లేటి దుర్గారావు, గోపిసెట్టి కుటుంబ ప్రసాద్, ఊస ఆంజనేయులు, పెనుగొండ నంద కిషోర్, యాదంరెడ్డి అంజిబాబు, పవన్ పాల్గొన్నారు.