రత్నాల చెరువు ముంపు ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు అందచేత

మంగళగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన నాయకులతో కలిసి గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలమునకు సమీపంలో గత వారం రోజులుగా కురుసిన వర్షాలకు ముంపుకి గురైన రత్నాల చెరువు ప్రాంతంలో ముంపు ప్రాంతంలో నీట మునిగిన ఇళ్లను, చేనేత మగ్గాలను పరిశీలించడం జరిగిన విషయం అందరికీ విదితమే. వారి ఇబ్బంది చూసి చలించిన చిల్లపల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం రత్నాల చెరువు ముంపు ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా రత్నాల చెరువు కాలనీవాసులు మాట్లాడుతూ.. నిన్న వచ్చి నీట మునిగిన ఇళ్లను పరిశీలించిన అనంతరం ఈరోజు మాకు నిత్యవసర సరుకులు అందించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, మా యందు దయవుంచి మాకు సహాయం చేసిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, మంగళగిరి పట్టణం 21వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు చింతిరాల బాబురావు, మంగళగిరి పట్టణం 22వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు నాగులపల్లి కామేష్, 21 &22 వార్డు జనసేన పార్టీ కమిటీ సభ్యులు, రత్నాల చెరువు జనసైనికులు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.