గాన గంధర్వునికి నివాళిగా రికార్డింగ్ థియేటర్స్ మూసివేతకు పిలుపు

కోట్లాది మంది అభిమానులకు గుడ్ బై చెప్పి గాన గంధర్వుడు దివికేగాడు. 16 భాషల్లో నలభై వేల పాటలు పాడిన ‘కారణజన్ముడు’ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు ప్రముఖ గాయని-‘తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్’ అధ్యక్షురాలు విజయలక్ష్మి.  ఈ రోజు  (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ అన్నీ స్వచ్చందంగా మూసివేయాలని.. గాయనీగాయకులంతా పాటల రికార్డింగ్స్ కు దూరంగా ఉండాలని.. తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, కార్యదర్శి లీనస్, కోశాధికారి రమణ శీలం పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలకు లోబడి గాన గంధర్వునికి ఘన నివాళి అర్పించేందుకు త్వరలోనే తేదీని ప్రకటిస్తామని విజయలక్ష్మి తెలిపారు.