క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న చెక్కబొమ్మల కార్మికులు

రైల్వే కోడూరు మండల పరిధిలోని శెట్టిగుంట పంచాయతీ లక్ష్మీ పల్లె గ్రామంలో దాదాపు 21 మంది చెక్కబొమ్మలు తయారు చేసే శ్రామికులు జనసేన పార్టీ సభ్యత్వాన్ని పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు సమక్షంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రామికులు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను, నిజాయితీని పేద ప్రజలను సైతం గుర్తిస్తున్నారని, అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి చాలా అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు శ్రామికులు జనసేన పార్టీ సభ్యత్వాన్ని ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నామని తెలియజేశారు. జనసేన పార్టీ రైల్వేకోడూరులో అంతర్లీనంగా ప్రజలతో కలిసిపోయి ఉందని, ప్రజా సమూహం తమ విలువైన ఓటు హక్కును రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి అనుకూలంగా తీసుకువస్తుందని ఈ సందర్భంగా దినకర బాబు ఆనందం వ్యక్తం చేస్తూ తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లంశెట్టి కిషోర్, సంతోష్, కోట శివయ్య తదితరులు పాల్గొన్నారు.