ఘనంగా కళావతి జన్మదిన వేడుకలు

విశాఖ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం, సిద్ధాంతాల కోసం బలంగా పనిచేస్తున్న రాష్ట్ర కాపు సంక్షేమ శాఖ మహిళా అధ్యక్షురాలు మరియు విశాఖ జనసేన పార్టీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ అయిన కరణం నూకరత్న కళావతి జన్మదిన జన్మదిన పురస్కరించుకొని సబ్బవరంలో ఉన్న తాసుపల్లి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గో సంరక్షణ కేంద్రంలో గోవులకు పశుగ్రాసం నిమిత్తం 5116/- రూపాయలు ఇచ్చి గోవులతో కాసేపు గడపడం జరిగింది. దీనికి సహకరించిన ఎస్ కోట కాపు సంక్షేమ శాఖ మహిళా అధ్యక్షురాలు సౌబిండి వెంకటలక్ష్మి, ఫౌండేషన్ అధ్యక్షులు శంకర్ నాయుడు, అఖిల్ లకు కళావతి ధన్యవాదాలు తెలపడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రం బాగుపడదని బలంగా నమ్మే వారందరికీ మరింత బలంగా పనిచేసే సామర్థ్యం చిత్తశుద్ధి, నిజాయితీ ఇమ్మని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేవరకు ఇదేవిధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే తాసుపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింహాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపుకు అటెండ్ అయ్యి రక్తదాతలను, విద్యార్థులను ఉద్దేశించి సమాజం పట్ల తమ బాధ్యత గురించి చెప్పి వారిని ప్రోత్సహించడం జరిగింది. అక్కడ నిర్వాహకులు కళావతికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ శాలువా కప్పి కేకు కట్ చేయడం జరిగింది.