కంచికచర్లలో ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు

కంచికచర్ల: ఒక వ్యక్తి వ్యవస్థగా రూపాంతరం చెంది అణగారిన వర్గాల గొంతుగా మారిన చరిత్ర వంగవీటి మోహన రంగాది అని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్ పేర్కొన్నారు. మంగళవారం వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా కంచికచర్ల జాతీయ రహదారి ప్రక్కన రంగా విగ్రహానికి జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి సతీష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేసి బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అయ్యారని అన్నారు. ఆయన పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ నేలను విడిచి మూడు దశాబ్దాలు దాటినా ఆ స్పూర్తి ఇంకా రగులుతునే సజీవంగానే ఉంది. ఇప్పటికీ ఏదో సందర్భంలో వంగవీటి మోహన్ రంగా పేరు వినిపిస్తునే ఉంది. కాపు కుల నాయకుడిగా ముద్రపడినా ఆయన అందరివాడు. అణగారిన వర్గాలను సైతం అక్కున చేర్చుకున్నారు. నేనున్నా అంటూ భరోసా కల్పించారు. అందుకే అమరుడైనా ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారని సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తోట ఓంకార్, కొఠారు దేవేంద్ర, దేవి రెడ్డి అజయ్ బాబు, పుప్పాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.