వేడుకలా నెల్లూరు సిటీ, రూరల్ జనసేన క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం

*జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ లో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శుక్రవారం నెల్లూరు సిటీ, రూరల్ లో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వాలంటీర్లకు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ సన్మానించడం జరిగింది

*క్రియాశీలక వాలంటీర్లకు జనసేన పార్టీ జెండా మరియు పవన్ కళ్యాణ్ గారి ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది

*జనసేన పార్టీకి క్రియాశీల సభ్యులకు పార్టీకి వారధిగా పని చేసిన వారి సేవలు అమోఘమైనవి, రానున్న రోజుల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను గడపగడపకు చేరవేసే విధంగా అందరూ సహకరించాలని కోరారు.

*జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులంతా విడివిడిగా కాకుండా కలిసికట్టుగా ఒకే లక్ష్యంతో పని చేయాలని జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే విధంగా కార్యాచరణ ఉండాలని తెలిపారు.

*ప్రాణప్రదంగా ప్రేమించే కార్యకర్తల్ని అధ్యక్షులు వారు కూడా అదేవిధంగా ప్రేమిస్తారని.. జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రమాద భీమా 50 వేల రూపాయలు అలాగే వ్యక్తిని కోల్పోతే వారి కుటుంబాాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినపుడు వారికి ఎంతో అది ఆసరాగా నిలబడింది.

*నెల్లూరు సిటీ లోని పరిధిలోని రవి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చివారి కుటుంబానికి ఆసరాగా జనసేన నిలిచింది.

*రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల 50 వేల మంది క్రియాశీలక సభ్యులతో పటిష్టమైన ప్రణాలికలతో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపొందినుంది.