మదనపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఇంచార్జ్ చైతన్య ఆదికేశవులు హాజరయ్యారు. మార్చి 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మదనపల్లెలోని శేష సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజంపేట పార్లమెంటు సమన్వయ కర్త అతికారి కృష్ణకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సభలో మాట్లాడిన అతికారి కృష్ణ, మార్చి 14న పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ సభకు కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు, అభిమానులు భారీగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని, వర్గ విభేదాలను మరచి ఏకతాటిపైకి రావాలని సూచించారు. కష్టపడి పని చేసే వారిని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారు తప్పక గుర్తిస్తారని, వారికి సముచిత స్థానం కల్పిస్తారని తెలియజేశారు. జనసేన పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న నేపథ్యంలో, పవన్ కల్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగించనున్న ఈ సభకు ప్రతి కార్యకర్త తప్పకుండా హాజరై ఆయన దిశానిర్దేశాన్ని నేరుగా వినాలని కోరారు. ఈ సందర్భంగా “చలో పిఠాపురం” పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, జిల్లా నాయకులు, నియోజకవర్గ మరియు మండల స్థాయి జనసేన నేతలు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment