కాకినాడ సిటిలో స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమం జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో 33వ డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్ రామకృష్ణారావుపేట సినిమా రోడ్డు ప్రాంతంలోను, 44వ డివిజన్ అచ్చుతాపురం గేటు ప్రాంతంలో తోట కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంధర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రోజుకొకటి బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా మోసం చేసిందని వేల కోట్లు దోచేసారని ధ్వజమెత్తారు. ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరనీ వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకి కొట్టుకుపోతుందనీ, అలాగే రేపు రాబోయే ఎన్నికలలో వై.సి.పి పార్టీ గాలికి కొట్టుకుపోతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, సిటీ కార్యదర్శి మహమ్మద్ సమీర్, దారపు సతీష్, కసుమూర్ ఖాన్, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ గారు, సిటీ కార్యదర్శి కంటా రవికుమార్, మధు, వాడ్రేవు లోవరాజు, మనోహర్లాల్ గుప్తా, అగ్రహారపు సతీష్, నక్కిలి సతీష్, నాగబాబు, కొమ్మన సురేష్, అప్పన్న, సురేష్ నాయుడు, ముల్లేటీ లొక భగవాన్, పెన్నమ్రెడ్డి బుజ్జి, రాయపాటి వెంకటేశ్వరరావు, తోట కృష్ణ తేజ, తోరం చిరంజీవి, తుమ్మలపల్లి సీతారాం, గుర్రాల త్రిమూర్తులు, దేవు మహేష్, నగులపల్లి వరప్రసాద్,తాతపూడి చిన్మయ శర్మ, పాకలపాటి అంజిబాబు, పాకలపాటి భాస్కర్, ముమ్మిడి పండు, అడపా కుమార్, దాసరి దుర్గప్రసాద్, తిరుమల శెట్టి క్రాంతి, గుబ్బల రవి కుమార్, కోపల్లి ప్రసన్నకుమార్, గంటిమి దుర్గా ప్రసాద్ మరియు వీరమహిళ రాగిణి, మోర్త మాలతి తదితరులు పాల్గొన్నారు.