చాకలి ఐలమ్మ విగ్రహ భూమి పూజ కార్యక్రమం విజయవంతం

ముధోల్, భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందర గల చాకలి ఐలమ్మ గద్దె వద్ద భూమి పూజ కార్యక్రమం రజక సంఘాల సమితి జిల్లా కో కన్వీనర్ సుంకెట పోషేట్టి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి హాజరై మాట్లాడారు ముధోల్ నియోజకవర్గంలో భైంసా మున్సిపల్ పట్టణంలో విగ్రహ ప్రతిష్ట స్థాపన కొరకు భూమి పూజ చేసి, విగ్రహ ఏర్పాటు కొరకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి సన్మానం చేసిన రజకులు అదేవిధంగా చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర పుస్తకాన్ని బహూకరించడం జరిగింది. అలాగే ఇక్కడకు వెచ్చేసిన డివిజన్ పరిధిలోని రజకులకు, ప్రజా సంఘాలకు, అన్నా బాహు సాటే కమిటీకి, దళిత బహుజన ఉద్యమ నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు, డైరెక్టర్లు, బిఅర్ఎస్ సీనియర్ నాయకులు విలాస్ గాదేవర్, మురళి గౌడ్, లస్మన్న, యశ్వంత్ బన్సోడే ప్రజా ప్రతినిధులు పొషెట్టి, సాహెబ్ రావు, ఉత్తం బలెరావ్, మారుతి, శంకర్, రజక సంఘం నాయకులు, బాబు,దత్తు, పోశెట్టి, సాయినాథ్, హరీష్, ముత్యం, భుమేశ్, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.