జనసేన ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన చలివేంద్రం

యర్రగొండపాలెం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సేవా స్పూర్తిని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ అబివృద్దిపధంలో భాగంగా ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తితో, యర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా. పాకనాటి గౌతమ్ రాజు ఆధ్వర్యంలో సోమవారం తాంగిరాల పల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రటరీ కె.చిన్నాపాల్ పాల్గొన్నారు. మండల నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభించటం జరిగింది. అనంతరం స్థానిక గ్రామ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమాన్ని తాంగిరాల పల్లి గ్రామ జనసేన నాయకులు రమేష్, యోహాన్, దావీదు, రాజారావు, అశోక్, బొరయ్య, ఆవులయ్య, జగన్, విజయ్ తదితరులు నిర్యహించారు. నియోజవర్గ నాయకులు సందీప్, జెడ్డా రాజు, పాపయ్య, సతీష్, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, శేషగిరి, శ్రీనివాస్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.