పిఠాపురం జర్నలిస్టుల ఆధ్వర్యంలో చలివేంద్రం

పిఠాపురంలో స్థానిక మెయిన్ రోడ్ సెంటర్ నందు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి, వారి హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండించే వేసవి తాపానికి కాస్త ఉపశమనం కలిగించేలా.. దాహార్తిని తీర్చేలా.. చల్లని మజ్జిగను, మంచినీళ్లను అందించే చలివేంద్రన్ని పిఠాపురం జర్నలిస్టులు అందరూ ఐక్యంగా కలిసి ఏర్పాటుచేసి ప్రజలకు, ప్రయాణికులకు మజ్జిగ, మంచి నీళ్లను అందించారు. నిత్యం వార్తలను అందించే పాత్రికేయులు సామాజిక కార్యక్రమాలను చెయ్యడం చాలా ఆదర్శనీయంగా ఉందని, ఈ కార్యక్రమం చాలా మందికి స్ఫూర్తిని అందిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.