బండ్రెడ్డి రామ్ చేతుల మీదగా చలివేంద్రం ప్రారంభం
గుడివాడ, రోజురోజుకి పెరుగుతున్న ఎండలు దృష్టిలో ఉంచుకొని, ప్రజలు తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గుడ్లవల్లేరు మండలం, వడ్లమన్నాడు గ్రామ జనసైనికులు కటకం నాగకృష్ణ & అడపా రామ్మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఇంచార్జి బూరగడ్డ శ్రీకాంత్, సందు పవన్, వేణుతురుమిల్లి సర్పంచ్ శ్రీమతి. కొప్పునేని శేషవాణి, పాలంకి సారధిబాబు, తోట చిన్నారి, అడపా బాబీ, పేర్ని జగన్, ఆకుల మోహన్, పంచకర్ల సురేష్, బండ్రెడ్డి రవి, ఆంజనేయులు వడ్లని, గరికిపాటి బాలాజీ, అడపా అనిల్, పుల్లేటి దుర్గారావు, ఇతర జనసేన నాయకులు, వడ్లమన్నాడు జనసైనికులు మరియూ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-28-at-11.26.41-1024x458.jpeg)