చలో కొండగట్టు.. కొండగట్టు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

వరంగల్: తెలంగాణ రాష్ట్ర జనసేన ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్ మరియు ఉమ్మడి వరంగల్ ఇంచార్జి సుమన్ ఆకుల ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన ఆధ్వర్యంలో బుధవారం కొండగట్టు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. జనవరి 24న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు యాత్రకు సంబందించిన పోస్టర్ ఆవిష్కరణ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లా నాయకులు మాజీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ చేతులమీదుగా చలో కొండగట్టు పోస్టర్ ఆవిష్కరించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజన్నను దర్శించి, ఆలయ సన్నిధిలో వరహి వాహనానికి పూజ జరిపించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు, అనంతరం తెలంగాణకు సంబందించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి రాబోయే రోజుల్లో తెలంగాణాలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించి దిశనిర్దేశం చేస్తారు.. కావున ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి పవన్ కళ్యాణ్ గారి యాత్రను విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తాళ్లపెల్లి క్రాంతికుమార్, వెళ్తూరి నగేష్, శేషాద్రి సందీప్, జన్ను ప్రవీణ్, సాయికిరణ్, రమేష్, అరుణ్, సాయి కృష్ణ పాల్గొన్నారు.