ఛలో మచిలీపట్నం విజయవంతం చేయాలి: రేగిడి లక్ష్మణరావు

విజయనగరం, 10 వ జనసేన పార్టీ ఆవిర్భావసభను విజయవంతం చేయాలని దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు మరియు విజయనగరం జిల్లా జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సూచించారు. రాష్ట్రంలో ఉన్న దళిత సత్తా క్యాడర్ మండల స్థాయి నియోజకవర్గస్థాయి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ, యువత, కార్మికులు, రైతులు అందరూ కూడా పాల్గొని సభని విజయవంతం చేయాలని కోరారు. జనసేన పార్టీకి దళిత సత్తా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పత్రికా ప్రకటనలో తెలియజేశారు.