ఛలో పిఠాపురం బ్రోచర్ ఆవిష్కరణ

దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ కోర్ కమిటీ ఆధ్వర్యంలో “ఛలో పిఠాపురం” కార్యక్రమ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు దర్శి నియోజకవర్గ జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోర్ కమిటీ సభ్యులు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు, కార్యకర్తలు జాగ్రత్తగా వెళ్లి, తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఐటి కో-ఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, పూపుల రుద్ర, దర్శి టౌన్ అధ్యక్షుడు చాతరాసి కొండయ్య, కురిచేడు మండల అధ్యక్షుడు మాధవ వెంకట శేషయ్య, ముండ్లమూరు మండల అధ్యక్షుడు తోటరామారావు, తాలూరు మండల అధ్యక్షుడు కూటల ప్రసాద్, దర్శి మండల నాయకులు పుపలా పాపారావు, షేక్ మీరవాలి, మంచాల నరసింహారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జైహింద్ అంటూ నినాదాలు చేసారు.

Share this content:

Post Comment