బాబు పాలూరు ఆధ్వర్యంలో ఛలో పిఠాపురం పోస్టర్స్ ఆవిష్కరణ

పిఠాపురంలో మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద రాష్ట్ర జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో “ఛలో పిఠాపురం” పోస్టర్లను విడుదల చేసి, పార్టీ అభిమానులు మరియు శ్రేయోభిలాషులను సభకు ఆహ్వానించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి మన్యం జిల్లా మరియు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి ప్రతి గ్రామం నుండి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాబు పాలూరు మాట్లాడుతూ, “దేశంలో దసరా, రంజాన్, క్రిస్టమస్, సంక్రాంతి వంటి ప్రధాన పండుగలతో పాటు జనసేనికులకు ప్రతి సంవత్సరం రెండు ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. మొదటిది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, రెండవది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అందరం కలిసికట్టుగా మార్చి 14న పిఠాపురం సభకు హాజరై మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆగూరు మణి, బంకురు పోలినాయుడు, మహిళా విభాగం నాయకులు బంటుపల్లి దివ్య, బోనెల గోవిందమ్మ, లక్ష్మి, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శులు గొర్లి చంటి, చిట్లి గణేష్, గంట్యేడ స్వామి నాయుడు మరియు పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment