చలో రణస్థలం యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

పాలకొండ: వీరఘట్టం మండలంలో, జనసేన పార్టీ నాయకులు చలో రణస్థలం యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సతివాడ వెంకటరమణ మాట్లాడుతూ యువత వారి గళం వినిపించేందుకు తరలి రావాలని, వాళ్ళ హక్కుల మీద యువశక్తి వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయం ఆసన్నమైందని వీరఘట్టం మండల జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తుందని తెగ హామీలు కురిపించిందని అధికారంలోకి వచ్చాక మొహంచాటేయడం సరికాదని అన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో వీరఘట్టం మండలం జనసేననాయకులు గర్భాపు నరేంద్ర, రౌతు గోవిందరావు, కోడి వెంకట నాయుడు, తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.