జనసేనతోనే మార్పు సాధ్యం: రాజంపేట జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య

రాజంపేట: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచడం ద్వారా రాష్ట్రంలో సుపరిపాలన, మార్పులకు ప్రజలు అండగా నిలవాలని రాజంపేట జనసేన పార్టీ నాయకుడు తాళ్లపాక శంకరయ్య కోరారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా 53వ రోజు సోమవారం రాజంపేట మండలం బాపనపల్లె పంచాయతీలోని హరిజనవాడ, అరుంధతి వాడలోప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంచుతూ, పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లపాక శంకరయ్య మాట్లాడుతూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, బడుగు బలహీన వర్గాల సమస్యలు తీరాలంటే జనసేన తోనే మార్పు సాధ్యమవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.