మార్పు రావాలి అంటే యువత రాజకీయాల్లోకి రావాలి

తెలంగాణ, వనపర్తి, గోపాల్ పేట మండలకేంద్రంలో జనసేన పార్టీ వనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆదేశాల మేరకు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకున్న జన సైనికులకు అందరికీ సభ్యత్వం కిట్లను పంపిణీ చేపట్టినట్టు గోపాల్ పేట మండల అధ్యక్షుడు ఉందేకోటి లక్ష్మి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని యువతకు, సామాన్య ప్రజానీకానికి పార్టీ సిద్ధాంతాలు ఆశయాలను ప్రస్తుత పరిస్థుతులలో జనసేన యొక్క ఆవశ్యకతను రాజకీయాల్లో నేడు కచ్చితంగా రావాల్సిన మార్పుల గురించీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కోసం చెయ్యాల్సిన విధుల గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నామని వచ్చే ఎన్నికల్లో జనసేన ఆ విధంగా మార్పుకు నాంది పలకబోతుంది అని అందరూ అండగా నిలవాలని పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆధ్వర్యంలో గ్రామ స్ధాయిలో పటిష్టంగా పార్టీ బలోపేతం చేసుకొని గోపాల్ పేట మండలంలో ప్రజలకు అందుబాటులో వారి అభివృద్ధి కొరకు పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట మండల అధ్యక్షుడు ఉందెకోటి లక్ష్మి నారాయణ ఉపాధ్యక్షులు కొరమోని శివ యువ నాయకులు విష్ణు, శివ, రామకృష్ణ, రమేష్, నరేష్, చిన్న, బాలచందర్, మహేష్, శ్రీను, దేవెందర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.