రంగులు మార్చి ప్రజాధనం వృధా చేస్తున్నారు: గాదె

గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణంలో ప్రభుత్వ నూతనంగా నిర్మించిన జగనన్న కాలనీలను ఆదివారం మధ్యాహ్నం జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తమ అధినేత పవన్ కళ్యాణ్ పై, జనసేన నాయకులపై అక్రమ కేసులు బనాయించడం వల్ల తాము భయపడి వెనక్కి తగ్గబోమన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో గృహాలను రంగులు మార్చి ప్రజాధనం వృధా చేసి తానే అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకోవడం దారుణం అన్నారు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యారని ఆరోపించారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జగనన్న కాలనీలో జగనన్న మోసం అనే పేరు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తాలూరి అప్పారావు, దేశంశెట్టిశెట్టి సూర్య, పొన్నూరు రురెల్ మండల అధ్యక్షుడు నాగిసెట్టి సుబ్బారావు, పొన్నూరు టౌన్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, మరియు జనసైనికులు పాల్గొన్నారు.