మేనమామగా ఉంటానంటూ మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్: గాదె

పాదయాత్ర సమయంలో అడ్డగోలుగా హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. మడమ తిప్పుతున్నాడని.. జగనన్న విదేశీ విద్య ద్వారా విదేశాలకు వెళ్లే పేద విద్యార్థులకు పూర్తిగా ఖర్చు ఎంతయినా భరిస్తానని హామీ యిచ్చి ఇప్పుడు ఏమాత్రం పట్టించు కోవడంలేదని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు.

జిల్లా కలెక్టరేట్ ముందు నెల రోజులుగా టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్న తల్లిదండ్రులను పరామర్శించారు.. విదేశాల్లో ఉన్న మా పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని వారి బాధను మొరపెట్టుకున్నారు.. గత రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అనంతపురం వాసి మాక్బుల్ జాన్, గుడివాడ కు చెందిన అనిత అనే పేద మహిళ కు సంఘీభావం తెలిపి ధైర్యం చెప్పారు.

ముస్లిమ్ సోదరలకు అన్నగా.. యస్సి లకు తమ్ముడుగా ఉంటానని.. ఇప్పడు విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వకుండా వారి జీవితాలతో ఈ చేతకాని ముఖ్యమంత్రి చెలగాట మాడుతున్నాడని.. హామిలిచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడని అన్నారు.. గత ప్రభుత్వం లో 350 మంది.. ఈ ప్రభుత్వం లో 160 మంది విద్యార్థులు విదేశీ విద్య ద్వారా పై చదువులు కోసం ఇతర దేశాలకు వెళ్లారని..తక్షణమే విదేశీ విద్యా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. లేకుంటే త్వరలోనే జనసేన పార్టీ కార్యాచరణ ప్రారంభిస్తుందని హెచ్చరించారు.. తల్లిదండ్రులు ఎవరు అధైర్య పడవద్దని జనసేన అండగా ఉంటుందని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టి కి ఈ విషయాన్ని తీసుకొనివెళ్తామని చెప్పారు.