ఎన్డీఏ కూటమికి మద్దతుగా చిలకం మధుసూదన రెడ్డి ప్రచారం

ధర్మవరం నియోజకవర్గం, ధర్మవరం రూరల్ రేగాటిపల్లి, ముచ్చురామి, సీతారాంపల్లి గ్రామాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రచారం చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి. గ్రామాల్లో పర్యటిస్తూ కచ్చితంగా జనసేన, బిజెపి, తెలుగుదేశం ఉమ్మడి కూటని అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ను గెలిపించుకొని ధర్మవరం నియోజకవర్గంలో రౌడీ రాజ్యం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కచ్చితంగా గద్దె దింపుతున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.