గురుపూర్ణిమ మహోత్సవానికి చిల్లపల్లికి ఆహ్వానం

మంగళగిరి గాలి గోపురం సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న శ్రీ శివ సాయి దివ్య మందిరంలో, జూలై 10వ తేదీ గురువారం “గురుపూర్ణిమ” సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున బాబా వారికి అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకంతో విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం ఉదయం ఏపీఎంసీడీసీ చైర్మన్ & జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుకి, శ్రీ శివ సాయి దివ్య మందిర సత్సంగ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా జనసేన మంగళగిరి కార్యాలయంలో అందజేశారు. గురుపూర్ణిమ సందర్భంగా జరుగనున్న ఈ కార్యక్రమం మంగళగిరిలో భక్తుల ఆధ్యాత్మిక భావాలను ఉద్రేకింపజేసేలా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Share this content:

Post Comment