వినాయక చవితి వేడుకలలో పాల్గొన్న చిల్లపల్లి

మంగళగిరి: వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా మంగళగిరి, షరఫ్ బజార్ లో శ్రీ లక్ష్మీనరసింహ స్వర్ణకారుల సంఘం వారు ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన పూజా కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమానికి సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ యువజన అధ్యక్షుడు షేక్ కైరుల్లా, మంగళగిరి పట్టణం జనసేన పార్టీ 22వ వార్డు అధ్యక్షుడు నాగులపల్లి కామేష్, చిల్లపల్లి యూత్ సభ్యులు శివ, బేతపూడి దీపక్ తదితరులు పాల్గొనడం జరిగింది.