కాకినాడ జిల్లా, పిఠాపురంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం ద్వారా వైద్య సేవల అభివృద్ధికి కీలకమైన అడుగు వేయబడింది. డిసెంబర్ 2024లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా శుక్రవారం పిఠాపురం సమగ్ర ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమ పనులను పరిశీలించి, పిఠాపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పలు విభాగాలను, వార్డులను, ప్రసూతి విభాగంను, ల్యాబ్ లను, వైద్య పరికరాలను, రోగులకు మరియు వారి సహచరులకు అందిస్తున్న భోజన వసతులు మరియు నాణ్యత గురించి క్షుణ్ణంగా పరిశీలించి కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నందు జరుగుచున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించిన ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ (ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి) చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు అధికారులు.
Share this content:
Post Comment