కొత్తపాలెంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న చిల్లపల్లి

మంగళగిరి, దేవి శరన్నవరాత్రుల మహోత్సవములలో భాగంగా పెదవడ్లపూడి కొత్తపాలెంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహం వద్ద మంగళవారం 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అమ్మవారిని అలంకరించారు. జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళవారం నిర్వహించిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెదవడ్లపూడి కొత్తపాలెంలో ఏర్పాటుచేసిన అమ్మవారి పూజా కార్యక్రమానికి ఆహ్వానించిన వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తదనంతరం పెదవడ్లపూడి గ్రామస్తులతో చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడి గ్రామ సమస్యల గురించి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), మంగళగిరి మండల కార్యదర్శి లింగినేని రవితేజ, పెదవడ్లపూడి గ్రామ సీనియర్ నాయకులు వీరాంజనేయులు, నాగేశ్వరావు, అర్జున్ రావు, రాఘవయ్య, పెదవడ్లపూడి గ్రామ జనసైనికులు శామీరూల్లా, పెన్నాడ గోపికృష్ణ, సాయి, లింగినేని కొండలు, నాగేశ్వరావు, మెంబెర్ కొండలు, దిండు శ్రీరాములు, సాయి, నచరయ్య, మణికంఠ, రాజకుమార్, సురేష్, దుర్గాప్రసాద్, గౌతమ్, చంటి, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, తదితరులు పాల్గొన్నారు.