జనసేన పార్టీ తరపున చిన్న రాజా బ్లడ్ క్యాంప్

నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ వెంగళరావు నగర్ లో గతంలో జనసేన పార్టీకి క్రియాశీలకంగా పని చేసిన ఆరవ విజయ్ కాంత్ మొదటి జయంతి సందర్భంగా స్థానికంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా దృక్పథంతో చేసిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు ఎంతో అభినందించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు గునుకుల కిషోర్ మాట్లాడుతూ

*జనసేన పార్టీ నాకేం ఇచ్చిందని ఎవరైనా అడిగితే అంతులేని అభిమానం పంచే తమ్ముళ్లనిచ్చిందని చెప్పుకుంటాను.

  • తోడబుట్టిన వాళ్ళిద్దరైతే తోడు నడిచే వాళ్ళు ఎంతమందో లెక్క కూడా పెట్టలేకున్నానని తెలిపారు.
  • ఇంతమంది అభిమానించే తమ్ముళ్ళను ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆశయ సాధనకు వారదిగా వ్యవహరిస్తానని.
  • నా వెనుక నడిచే తమ్ముళ్లఅందరికీ మార్గదర్శకంగా నడుచుకుంటానని తెలిపారు.
  • అరవ విజయ్ కర్ర సాము వంటి కళలలో ప్రవీణ్యం గల సోదరుడు తక్కువ వయసులోనే మాకు దూరమవడం నిజంగా దురదృష్టమని తెలిపారు.
  • ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ సోదరుని స్మృతి నివాళులర్పిస్తూ జనసేన పార్టీ తరపున చిన్న రాజా బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసి దాదాపు 50 యూనిట్ల రక్తాన్ని అందించడం అభినందనీయమని తెలిపారు.
  • విజయ్ కాంత్ గతంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే వారిని నెల్లూరు రూరల్ లో జనసేన కి గట్టిగా పట్టున్న ప్రాంతం 33 వ డివిజన్ అనీ రానున్న రోజుల్లో జనసేన పార్టీకి పట్టం కట్టే విధంగా అందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమం జనసేన స్థానిక నాయకుడు అరవ చిన్నరాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, వినోద్, జాన్ పాల్, ఉద్దేష్, మిధున్, కంథర్, అమీన్, అలేఖ్, ఖలీల్, ప్రసన్న, ఇంతియాజ్, షాజహాన్, హేమంత్ యాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.