చిన్నారి హేమంత్ కు రాజోలు జనసేన కువైట్ గ్రూప్ ఆర్థికసాయం

మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో శుక్రవారం కామిశెట్టి రమేష్ కుమారుడు కామిశెట్టి హేమంత్ కు బోన్ మ్యారో కి సంబంధించి ఆపరేషన్ నిమిత్తం జనం కోసం మన జనసేన రాజోలు కువైట్ గ్రూప్ సభ్యులు యర్రంశెట్టి బాబి మరియు వారి గ్రూపు సభ్యలు 17,000 ఆర్థికసాయం అందచేసినారు. ఈ కార్యక్రమంలో పెదపట్నం లంక గ్రామ సర్పంచ్ సుందరనీడి రాజేష్ కుమార్(చిన్ని), శిరిగినీడి శ్రీనివాసరావు, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు పంచదార చినబాబు, స్థానిక జనసేన నాయకులు వీధి సత్తిబాబు, తుల ఉమ, కంకిపాటి నాని, రవణం సాయిరాం పాల్గొన్నారు. స్థానిక గ్రామస్థులు కువైట్ గ్రూపు సభ్యలు అందరికి అభినందనలు తెలియజేశారు.