కానిస్టేబుల్ సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించిన చింత సురేష్ బాబు

నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ గా పనిచేసస్తూ ఇటీవల కిరాయి అంతకుల చేతిలో దారుణ హత్యకు గురైన సురేంద్ర కుటుంబాన్ని శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ చింత సురేష్ బాబు వారి పరామర్శించి సురేంద్ర హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేదాకా జనసేన పార్టీ పోరాడుతుందని.. బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సురేష్ బాబు మాట్లాడుతూ ప్రశాంతమైన నంద్యాల పట్టణంలో ఒక ప్రభుత్వ అధికారి నిజాయితీపరుడైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ సురేంద్ర గారు హత్యకు గురి కావడం బాధాకరం పోలీస్ అధికారులకే భద్రత లేకపోతే సామాన్యులకు భద్రత ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నంద్యాల నియోజకవర్గ నాయకులు సుధాకర్ గారు వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున వారి కుటుంబంలోని వారికి ప్రభుత్వ ఉద్యోగము మరియు కోటి రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు, ఈ హత్యకు వెనుక ఉన్నటువంటి వ్యక్తులను అలాగే కిరాయి హంతకులను పట్టుకొని శిక్షించాలని పోలీసు అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *