అంబేద్కర్ కు ఘననివాళులర్పించిన చింతలపూడి జనసేన

చింతలపూడి, భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు ఆధ్వర్యంలో సుందరరావుపేట గ్రామంలో మహనీయులు, స్పూర్తి ప్రదాత డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల ఉపాధ్యక్షుడు తాళం మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బంటు సామ్యెల్ రాజు, కార్యదర్శులు పంది సతీష్ కుమార్, పొదిల మహేష్, మఠంగూడెం గ్రామం జనసేన నాయకుడు సాయిల ప్రేమ్ కుమార్, కొత్తపల్లి గ్రామం జనసేన నాయకుడు గెడ్డం సురేష్, నాగరాజు పాల్గొన్నారు.