చింతామణి జనసేన ఆర్మీ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం

  • దాదాపు 200 యూనిట్ల రక్తదానం
  • 51 కేజీల కేక్ కటింగ్

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని చింతామణి పట్టణంలో జనసేన ఆర్మీ ఆధ్వర్యంలో ముందుగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు స్థానిక వినాయక రంగ మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక లయన్స్ క్లబ్ మరియు జనసేన ఆర్మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 51 కేజీల కేక్ కట్ చేసి యువకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి దాదాపు 200 యూనిట్ల రక్తాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద రక్తదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం బెంగళూరు పట్టణంలోని ఎన్.వి.జె మెడికల్ కాలేజ్ వారి శాఖ సహాయ సహకారాలు అందించడం జరిగింది. అందులో భాగంగా మెడికల్ కాలేజ్ వారు పేదలకు ఉచిత జ్ఞానేంద్రియాల మెడికల్ క్యాంపు నిర్వహించి కావలసిన చికిత్స, మందులు ఉచితంగా అందజేయడం అయింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత మరియు చింతామణి స్థానిక జెడిఎస్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, తులసి శ్రీనివాస్ హాజరై చింతామణి జనసేన ఆర్మీ నిర్వాహకులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని స్థానిక యువత మరియు లైన్స్ క్లబ్ గవర్నర్ మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చింతామణి జనసేన ఆర్మీ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు గణి, అధ్యక్షులు ఆర్.ఆర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గిడ్డు బాయ్, కార్యదర్శులు షాబుద్దీన్, రెడ్డి ట్రెజరర్స్ ప్రసన్న కుమార్, ప్రవీణ్ ట్రస్ట్ సభ్యులు శివ కుమార్, నరసింహమూర్తి, మురళి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.