కడిమి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించిన చిర్రి బాలరాజు

పోలవరం మండలం, ప్రగడపల్లి గ్రామంలో జనసైనికుడు కడిమి సుబ్రహ్మణ్యం నాలుగురోజుల క్రితం కాలం చేయగా శోక సముద్రంలో మునిగిన వారి కుటుంబాన్ని పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు పరామర్శించారు. పార్టీలో నిత్యం బలోపేతానికి ఎంతగానో శ్రమించిన కార్యకర్త చనిపోవడం మమ్మల్ని దిగ్బ్రాంతికి గురిచేసిందని, వారి కుటుంబానికి అండగా జనసేనపార్టీ ఉంటుందని వారిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, టౌన్ అధ్యక్షులుమాదేపల్లి శ్రీను, కొయ్యలగూడెం మండల ప్రధాన కార్యదర్శి ప్రగడ రమేష్, గెడ్డం బాల యేసు, ప్రగడపల్లి మండల కార్యదర్శి నరసరపు నాగేంద్ర, మీదట సురేష్ తదితరులు పాల్గొన్నారు.