కొత్తవలసలో చిరు జన్మదిన వేడుకలు

కొత్తవలస చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో సోమవారం చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు సాగాయి. ముందుగా పార్టీ నాయకులు గొరపల్లి రవికుమార్, గొరపల్లి చినబాబు సమక్షంలో కేకు కట్ చేశారు. చిన్నారులకు పండ్లు, కేకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ సామాజిక సేవకు చిరంజీవి పర్యాయపదంగా నిలిచారని కొనియాడారు. ఆయనలోని కృషి, పట్టుదల నేటి యువతకు ఆదర్శమన్నారు. చిరంజీవి మార్గంలో జనసైనికులంతా సమాజసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో చిరంజీవి అభిమానులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జనసేన నాయకులు జొన్నపల్లి సత్తిబాబు, మల్లువలస శ్రీను, పిల్లా రామదుర్గ, నక్కరాజు సతీష్, గాలి అప్పారావు, తూరిబిల్లి విజయ్ కుమార్, రామకాశీ, బోని రామ గణేష్, గురజాడ వెంకటేష్, మళ్ల రాజు, దాలిబోయిన రాజు, అలమండ సురేష్, ముచ్చకర్ల శ్రీను, పెంటకోట శ్రీను, నాగేంద్ర, బాలరాజు, వీరుబాబు, లోకేష్ పాల్గొన్నారు.