గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో చిరు పవన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన వచ్చిoది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సెలబ్రిటీలు చురుగ్గా పాల్గొని వారి స్నేహితులను ఈ ఛాలెంజ్లో పాల్గొనాలంటూ నామినేట్ చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి నాయకత్వంలో ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్తో మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్కల్యాణ్ ప్రారంభించారు. అందులో బాగంగా ఈ సొసైటీ ప్రాంగణంలో వీరు మొక్కలు నాటారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు.