చిరుపవన్ సేవాసమితి మంచి నీటి సరఫరా

జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం వరదప్రాంతం అప్పనిరామునిలంకలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి అప్పనరామునిలంక గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గుబ్బల సూర్యనారాయణ అందించిన (ట్రాక్టర్ డీజల్)ఖర్చులతో అప్పనరామునిలంక జనసైనికుల ద్వారా వరద బాధితులకు త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ శాఖ ఉపాధ్యక్షులు నల్లి జయరాజు, మిరియాల బుజ్జి, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు అని జనసేన నాయకులు నామన నాగభూషణం
తెలిపారు.