పుంగనూరులో పర్యటించిన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ జిల్లాలో 4 రోజుల విస్తృత పర్యటనలో భాగంగా, రెండవ రోజు పర్యటన పుంగునూరు నియోజకవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నా రాయల్ ఆధ్వర్యంలో జరిగిన మండల కమిటీ సభ్యుల సమావేశంలో జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి మండల అధ్యక్షులకు మరియు మండల కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఓటర్ కి, లీడర్ కి మధ్య అనుసంధానంగా పని చేస్తూ మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా విది విధానాలను అనుసరిస్తూ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలను పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. అదేవిధంగా మిషన్ 3000 అనే బృహత్తర కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, యువతి యువకులు పార్టీలో కీలక పాత్ర పోషించే విధంగా నాయకులు పార్టీ అధ్యక్షుల గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాలు నిర్వాహక కమిటీ కో ఆర్డినేటర్ పగడాల మురళి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు తులసి ప్రసాద్, శ్రీమతి దారం అనిత, జిల్లా కార్యదర్శులు దేవర మనోహర, నసీర్, కలప రవి మరియు పుంగునూరు నియోజకవర్గ మండల అధ్యక్షులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.