మదనపల్లి జనసేన కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు

మదనపల్లి, జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మరియు మదనపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ గంగారపు ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు వీరమహిళలతో కలిసి మదనపల్లి దేవత నగర్ లో చైతన్య అనాధ ఆశ్రమంలో వృద్దులు, పిల్లలతో కలసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడుతూ జనసేన పార్టీ తరుపున పదిమంది సంతోషంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏవి అయితే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అదే బాటలో మదనపల్లి జనసేన పార్టీ తరుపున మేము కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ, రూరల్ మండలం ఉపాధ్యక్షులు చంద్రశేఖర, పట్టణ ఉపాధ్యక్షులు కుమార్, లవన్న, పట్టణ సెక్రటరీ జనార్దన్, పట్టణ సెక్రటరీ కొల్ల నాగవేణి రాయల్, గిరి తదితరులు పాల్గొన్నారు.