కరకుదురు జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో కాశీ రాణి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న చర్చి నందు క్రిస్మస్ సందర్బంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు జనసేన పార్టీ మరియు శ్రీ పవన్ కళ్యాణ్ తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి జనసేన వీరమహిళ పాఠంశెట్టి కాశీ రాణి, మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25న ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ పండుగ నిర్వహించుకుంటారని అన్నారు. క్రిస్మస్ రోజున చర్చికి వచ్చి ప్రార్థనలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల బుజ్జి, మేడిశెట్టి గంగాధర్, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.