జనసేన ఉత్తరాంధ్ర మహిళాకమిటి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

ఉత్తరాంధ్ర: జీసస్ కృప ఎల్లప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద ఉంచాలి అని ప్రార్ధిస్తూ జనసేన ఉత్తరాంధ్ర ప్రాంతీయ మహిళాకమిటి ఆధ్వర్యంలో, ఉత్తరాంధ్ర పార్టీ ఆఫీసులో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 2023 జనవరి 12న జరగబోయే యుపశక్తి కార్యాక్రమం యోక్క కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం తమ్మిరెడ్డి శివశంకర్, బోలిసెట్టి సత్యనారాయణ, కోనతీతారావు, సమన్వయ కర్తలు ఉషాకిరణ్, సందీప్, పి.వి.ఎస్.ఎన్ రాజు, జివియంసి కోర్పరేటర్ పీతలమూర్తీయాదవ్, ఉత్తరాంధ్ర మహిళాకమిటి మెంబర్ లు సారణి, త్రివేణి, కిరణ్, లక్ష్మీ రాజు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.