వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తయినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం: ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలల్లో పశ్చిమ ప్రకాశ ప్రాంత ప్రజల ప్రజాగ్రహాన్ని చవి చూడవలసి వస్తుందని ప్రాజెక్ట్ యొక్క రెండు టన్నెల్స్ పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రికి కృతజ్ఞత పేరుతో వారికి, వారే చెప్పుకోవటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, వాస్తవానికి రెండో టన్నెల్ పూర్తి కావడానికి మరో ఎనిమిది నెలలు పడుతుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం డిజైన్ ని పట్టించుకోకుండా వాల్ ప్లాస్టింగ్ చేసి ‘మమ’ అనిపించారు. వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందాలనే తాపత్రయం తప్ప నాణ్యమైన నిర్మాణాన్ని చేపట్టలేదు. టన్నెల్ వాల్ కి రింగ్ లు అమర్చి నిర్మాణం పూర్తి కావడానికి సమయం పడుతుంది. వైఎస్సార్సీపీ నాయకులు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు అర్ & ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ఎలా పూర్తి చేస్తారు. ముందుగా నిర్వాసితులకు పరిహారం చెల్లించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలియజేస్తున్నము. అలాగే వైఎస్సార్సీపీ నాయకులు వెలిగొండ ప్రాజెక్ట్ అన్ని టన్నెల్స్ పూర్తి అయ్యాయని తెలిపినందున ప్రాజెక్ట్ టన్నెల్స్ నాణ్యత సందర్శనకు అఖిల పక్ష నాయకులతో, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో రావడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేస్తున్నామని మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ అన్నారు.