సీఎం గారు…రహదారుల్లో గుంతలు కనపడలేదా..?: రామశ్రీనివాసులు

*రోడ్లలో గుంతల వద్ద! (గుడ్ మార్నింగ్ సీఎం సర్) అనే నినాదంతో నిరసనలో జనసేన పార్టీ !!

అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రి గారు రహదారుల్లో బావులను తలపిస్తున్న గుంతలు మీకు కనబడలేదా..? వాహనదారుల నరకయాతన ఇంకెన్నాళ్లు పడాలి అని జనసేన పార్టీ నాయకులు రామశ్రీనివాసులు అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని నిలదీస్తూ అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలో సుండుపల్లి ప్రాంతాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రహదారుల్లో బావులను తలపిస్తున్న గుంతల వద్ద ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దుస్థితి అద్వానంగా ఉందన్నారు. సుండుపల్లి, పలు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల యొక్క పరిస్థితి మరింత అద్వానంగా ఉందన్నారు. గతంలో కురిసిన తుఫానులకు ఇటీవల కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లన్నీ గుంతల మయంగా మారడమే కాకుండా కోతలకు గురి కావడంతో వాహనదారులు ఆ రోడ్లలో ప్రయాణించాలంటే ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాసులు, జనసైనికులు, మహిళలు, గ్రామస్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.